పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై భారీగా పడింది. బుధవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రభావం ఎలా ఉంటుందో అనే భయంతో మదుపర్లు జాగ్రత్త పడుతున్నారు. ఎర్లీ ట్రేడింగ్లో సెన్సెక్స్ 1,700 పాయింట్లకి పైగా పడిపోయి 78,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 500 పాయింట్లకి పైగా కోల్పోయి 24,340 స్థాయికి చేరింది. ఆ తర్వాత సెన్సెక్స్ 1400 పాయింట్ల పైగా తగ్గగా, నిఫ్టి 400 పాయింట్లకు తగ్గింది.

