ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్ను ఇవాళ (శుక్రవారం) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకూ వైద్య చికిత్స అందజేయనున్నారు.

