‘‘తెలంగాణలో కరెన్సీ మేనేజర్(సిఎం) కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తారట.గతంలో రాహుల్ గాంధీ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అంతం చేసే సెల్స్ అని అన్నారు. మిస్టర్ గాంధీ మీకు తెలుసా.. మీ సిఎం ఏం చేస్తున్నారో..? ఇలా ఎంత బెదిరించినా.. భయపడేది లేదని.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ప్రజలపై, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’’ అని కెటిఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు గతంలో రాహుల్ చేసిన పోస్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ను ఆయన జత చేశారు.

