అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 వరల్డ్కప్ టోర్నమెంట్కు శనివారం తెరలేవనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి. బరిలో ఉన్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. శనివారం ఉదయం పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య కొలంబోలో జరిగే మ్యాచ్తో వరల్డ్కప్ టోర్నీకి తెరలేస్తోంది.

