పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్గాంధీ ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్ కేసు వేసింది. మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ జరిగిన విచారణకు రాహుల్గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

