ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టడానికి వస్తానని చెప్పినప్పుడు.. తాను హైదరాబాద్లో అందుబాటులో లేనని, బెంగళూరులో ఉన్నానని కేటీఆర్ సందేశం పంపారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సందేశం అందుకున్న తర్వాత.. కవిత కేటీఆర్ను కలవకుండానే రాఖీ పండుగ జరుపుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ పరిణామం వారి మధ్య దూరం పెరిగిందనడానికి సంకేతమని అంటున్నారు. వైఎస్ జగన్, షర్మిల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది.

