భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ మేరకు ఇండియాలో 17.5 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడికి హామీ ఇచ్చారు సత్య నాదెళ్ల. దేశంలో కృత్రిమ మేథ(AI) సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కాగా, ఆసియాలో మైక్రోసాఫ్ట్ తరఫున ఇదే అతిపెద్ద పెట్టుబడి అని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం పేర్కొన్నారు.

