మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్య పెరిగిందనే ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) జ్ఞానేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేసిన సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలల తర్వాత ఈ ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.

