మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి రాష్ట్రాన్ని యూపీ, బిహార్ లా మారుస్తోందని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే విమర్శించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ సేన), శివసేన(యూబీటీ) కలిసి సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేశాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమను ఎవరూ తొలగించలేరనుకుంటే పొరపాటని, మహారాష్ట్రను యూపీ, బిహార్ లా మారుస్తున్నారని రాజ్ థాక్రే అన్నారు. రాష్ట్రం దేశానికే దారి చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు.

