కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం బెగుసరాయ్ జిల్లాలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ .. రాహుల్ గాంధీ బోటులో ఓ చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకు తన ఒంటిపై దుస్తులు విపి, బనియన్, షాట్తో ముకేశ్ సాహ్నీ చెరువులోకి దిగారు. స్థానిక మత్స్యకారులతో చేపలను వేటాడారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది.

