విశాఖ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకులు జరగనున్నాయి.సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఆర్నాలతో పాటు, 61 దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు పాల్గొంటాయన్నాయి. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు నేవీ బోట్లు నిలుపుదల చేసే సముద్ర ప్రాంతాల్లో చేపల వేట చేపట్టకుండా, అలాగే బోట్లు సంచరించకుండా సహకరించాలని మత్స్యకారులకు మత్స్యశాఖ జేడీ విజ్ఞప్తి చేశారు.

