ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని, లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇండ్లను తగలబెట్టారు. స్థానికంగా ఉన్న సరీఖాంగ్ గ్రామంలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ హింసాత్మక ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆందోళనలు ఆగడం లేదు.

