వినాయక చవితి వేడుకల వేళ భాగ్యనగరం భక్తిశ్రద్ధలతో ముస్తాబైంది. నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ పరిధిలోని ఫీల్ఖానా ప్రాంతంలో కొలువుదీరిన సుమారు 48 కిలోల బరువుతో అరుదైన శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఈ విగ్రహాన్ని సుమారు 3.83 లక్షలకు పైగా మెరిసే అమెరికన్ డైమండ్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీనికి అదనంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూతను ప్రయోగించడంతో, స్వామివారు దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు.