మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. ఆదివారం రోజున విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసిన పోతుల సునీత… ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక, పోతుల సునీత గతేడాది ఆగస్టులో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన పోతుల సునీత… తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కండువా కప్పుకున్నారు.

