మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. నగర పరిధిలో ఉన్న ఓ ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఎక్కువ మొత్తం ప్టాస్టిక్ సామాగ్రి ఉండడంతో కొన్ని క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలుతో పాటు పొగ ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రాంతాలు మొత్తం పొగ మయంగా మారిపోయి.సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి.

