ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి ఆరు పేజీల సంచలన లేఖ రాశారు. వయసు పైబడటంతో ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “పార్టీ క్లిష్ట దశలో ఉంది.. కాంగ్రెస్కు కొత్త నాయకత్వం అవసరం. గత మూడేళ్లుగా రాహుల్ను కలవడానికి తాను చాలా ప్రయత్నించినా, అపాయింట్మెంట్ దొరకలేదని లేఖలో పేర్కొన్నారు.

