ప్రసాద్ లాబ్స్ లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న నిర్వహించాలని ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

