దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రి సెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మంది పిల్లలు,
యుక్తవయసులు ఉన్నట్టు పేర్కొన్నది. పురుషుల కంటే మహిళల్లో ‘డీ’ విటమిన్ లోపం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది. దేశంలో ఏడాది పొడవునా తగినంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుదల, పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి ‘డీ’ విటమిన్ లోపానికి దారితీస్తున్నట్టు ఐసీఆర్ఐఈఆర్ వెల్లడించింది.

