ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని,సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి తెలంగాణలోని హైదరాబాద్ లో,మహారాష్ట్రలోనూ పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.

