పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించింది. ఈ అణు క్షిపణి పరీక్ష మంగళవారమే జరుగగా.. ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు Minuteman-III బాలిస్టిక్ మిస్సైల్ ను అమెరికా ఎయిర్ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది. జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు.

