ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దాంతో ఇవాళ భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలను రద్దుచేశారు. ఈ విషయాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ఎయిర్సేవ’కు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వాటిలో 105 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు

