
ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులు మరోసారి నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పండిన ఉల్లిని తాడేపల్లిగూడెం మార్కెట్యార్డుకు తీసుకువచ్చిన రైతులు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఉల్లికి కిలోకు కేవలం రూ. 5 నుంచి రూ. 10 మాత్రమే ధర పలుకుతోందని వారు తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లికి కిలోకు రూ.12 నుండి రూ. 18 వరకు ధర ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.