ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్లో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరగడంతో పాటు, లోక్సభ సీట్లు కూడా మరో 7 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

