తమిళనాడు రాజకీయాల్లో భాషా వివాదం మరోసారి చిచ్చు రేపింది. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం ఉత్తర భారత వలస కార్మికులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర భారతీయులకు కేవలం హిందీ మాత్రమే వచ్చిని.. వారికింకేది తెలియదని అన్నారు. అందుకే వారంతా ఇక్కడకు వచ్చి పానీపూరీలు అమ్ముకుని బతుకుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు.

