
1995లో తిర్యాణి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో పోలీస్స్టేషన్ పాక్షికంగా దెబ్బతిన్నది. పేల్చివేతకు గురైన తిర్యాణి పోలీస్స్టేషన్ ఇప్పుడు యువతకు విజ్ఞానాన్ని అందించే లైబ్రరీగా మారింది.
ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ చొరవతో పోలీస్స్టేషన్ను లైబ్రరీగామార్చారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు.
- 0 Comments
- KumuramBheemAsifabad District