ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు. కట్టుబట్టలతో ఇండ్లలో నుంచి బయటకు వచ్చి నిరాశ్రయులైన బాధితులు సామాగ్రితో ఓ వైపు చెట్ల కింద తలదాచుకుంటుండగా.. మరోవైపు కొంతమంది ఆటో ట్రాలీలను నివాసాలుగా మార్చుకున్నారు. వెలుగుమట్ల బాధితుల దయనీయ పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

