
సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కెబినేట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సి మాల, ఎస్సి మాదిగ, బిసి ముదిరాజ్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. వీరిలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరి ముగ్గురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. డిప్యూటీ స్పీకరక్ గా రామచంద్రు నాయక్ ఖరారయ్యారు.