టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్పై 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ పూర్తిగా తడబడింది. కాగా 188 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ అంచనాలకు తగిన విధంగా ఆడలేకపోయింది. భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ డకౌట్ అవ్వగా, అభిషేక్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ (1), వాషింగ్టన్ సుందర్ (11), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) వెంటవెంటనే పెవిలియన్ చేరారు.

