సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 257 పరుగుల భారీ ఛేదనలో జింబాబ్వే ఓనర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితం అయ్యింది. బ్రియాన్ బెన్నెట్ (97* పరుగులు) భారీ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లలో అర్షదీప్ 3, వరణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

