
భారత్లోని పహల్గంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ.. మే 4న ప్రవాస భారతీయులు ‘Bharatiya Parivar BW’ పేరిట జర్మనీలోని స్టట్గార్ట్లో శాంతియుత సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు జరగ్గా.. 300 మందికి పైగా ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభమయ్యే ముందు సభ్యులందరూ నుదిటిపై తిలకం పెట్టుకున్నారు. దానిని సాంస్కృతిక ఐక్యతకు, నివాళికి నిదర్శనానికి గుర్తుగా చెప్పుకొచ్చారు.