
జూన్ 6న ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోదీ అదే రోజు ఆ వంతెన మీదుగా వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చ జెండా ఊపనున్నారు. ఈ వంతెన ఎంత ఎత్తులో ఉంటుందంటే కుతుబ్ మీనార్, ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ. ఉధమ్పూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ కనెక్టివిటీలో భాగంగా చీనాబ్ నదిపై నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది. ఇకపై జమ్ము నుంచి శ్రీనగర్ కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు.