మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.

