బంగారం, వెండి ధరలు మళ్లీ భారీ షాక్ ఇచ్చాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1310 పెరిగింది. దీంతో తులం ధర రూ.1,57,910కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1200 పెరిగి తులం ధర రూ.1,44,750గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక్కరోజే కిలోకు రూ.15,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది.

