
నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూపురం ప్రజలు ఆయనకు పౌర సన్మానం చేశారు. 50 ఏళ్లు హీరోగా ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అన్నేళ్లు నటించినా, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఇది సాధ్యం. కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో, పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.