కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో విద్యార్థులకు పురుగుల టిఫిన్ పెట్టడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం ఉప్మా (నాటు రవ్వ) లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ డైరెక్టర్ను తొలిగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో హాస్టల్ డైరెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన టిఫిన్, భోజనం అందించడంలేదని ఆందోళనకు దిగారు.

