ఘనా దేశంలో ఘోరమైన సైనిక హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 6, బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ మిలిటరీ హెలికాప్టర్ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీ తో సంబంధం కోల్పోయింది. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.

