
తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు తనకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరులతో ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలిపించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దందాలను గుర్తు చేసినందుకే తనను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి అధిష్ఠానానికి సుధాకర్ చెప్పినట్టు తెలుస్తోంది.