కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో బయలుదేరింది. ఫిబ్రవరి 13న ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని వారు దర్శించారు. ఆ తర్వాత రాజస్థాన్లోని ఖాతు శ్యామ్ జీ ఆలయానికి కారులో ప్రయాణమయ్యారు.

