కడపలో మహానాడు నిర్వహించడం సత్తా కాదని హామీలు అమలు చేయడం అసలైన సత్తా అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో చట్టం మరియు శాంతిభద్రతలు క్షీణించాయని, టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “జగనన్న 2.0″గా తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, కార్యకర్తలను రక్షించడానికి, బలోపేతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

