ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమాన్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమాన్ (ఫస్ట్ క్లాస్)’ను ప్రదానం చేసింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ, ఇప్పటివరకు 29 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇది భారత్–ఒమాన్ ప్రజల మధ్య ఉన్న అనురాగం, నమ్మకానికి ప్రతీక అని అన్నారు.

