ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, రాజకీయ విమర్శలపై సూటిగా స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక సూచనలను స్వీకరించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే విమర్శలను ‘చౌకబారు విమర్శలు’గా సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. పక్క రాష్ట్రాలతో చర్చించి తెలంగాణ నీటి హక్కులను కాపాడతామని స్పష్టం చేశారు.

