ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆ ఏనుగులు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపాయి. గురువారం రాత్రి చుర్చు బ్లాక్లోని గోండ్వార్ గ్రామంలోకి ఆ ఏనుగులు ప్రవేశించాయి. శుక్రవారం తెల్లవారుజామున ఒక పూరింటిపై దాడి చేశాయి. ఆ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరిని తొక్కి చంపాయి. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

