
సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మూరత్ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం జరుగనున్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యులర్ జారీ చేశాయి. సర్క్యులర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మూరత్ ట్రేడింగ్ సాయంత్రం జరిగేది. కానీ, ఈ సారి మాత్రం దీపావళి మూరత్ ట్రేడింగ్ ఈ నెల 21న మధ్యాహ్నం 1.45గంటల నుంచి 2.45 గంటల వరకు జరుగుతుందని సర్క్యూలర్లో ఎన్ఎస్ఈ పేర్కొంది.