
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి కూడా విద్యామిత్ర కిట్లు ఇవ్వలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం స్కూల్ విద్యార్థులకు మాత్రమే కిట్లు ఇచ్చేవారు. కానీ కూటమిప్రభుత్వం మాత్రం ఇంటర్ విద్యార్థులకు కూడా కిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కిట్లను అందించేందుకు రెడీ అయ్యింది. ఇక వీరికి కూడా కాలేజీ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్ అన్ని ప్రభుత్వం నుంచే అందుతాయి.