వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాన్పిక్ (వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టుకు సంబంధించి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను విడుదల చేయాలంటూ గతంలో పీఎంఎల్ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన 9 సివిల్ మిస్సిలేనియస్ సెకండ్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది.