ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని బన్నూ నగరం శనివారం రాత్రి పెను పేలుడుతో దద్దరిల్లింది. ఫతేఖేల్ పోలీస్ చెక్పోస్ట్ను లక్ష్యంగా చేసుకుని ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఆత్మాహుతి దాడి తీవ్రతకు చెక్పోస్ట్ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది పోలీసు సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి అనేక మంది అధికారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.