హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై క్రికెట్ సంఘాలు మండిపడ్డాయి. హెచ్సీఏలో( HCA ) లో మంత్రి వివేక్కి చెందిన విశాఖ ఇండస్ట్రీస్కి రూ.70 కోట్ల అక్రమంగా చెల్లించారని జింఖానా గ్రౌండ్లో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు హెచ్సీఏ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న క్రికెట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని హెచ్సీఏ అధ్యక్షులు ప్రకటించారు.

