ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వివాదం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి. గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిన్న కుప్పం కోర్టు రిమాండ్కు పంపేందుకు నిరాకరించింది. అయితే తాజాగా ఆ తీర్పును ఏపీ హైకోర్టు నిలిపివేసింది. వారిని రిమాండ్కు తరలించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

