బెంగళూరులో ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని ఒక వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి ఆమె కుటుంబం కూడా అంగీకరించింది. అయితే ఆమె వివాహం విఫలమవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడిని విద్యాజ్యోత్ సంప్రదించింది. అయితే ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం విఫలమవుతుందని, రెండేళ్లకే వారిద్దరూ విడిపోతారని జ్యోతిష్కుడు చెప్పాడు.

