ఈనెల 18న ఈరోడ్లోని విజయపురిలో విజయ్ తన తదుపరి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ర్యాలీ జరగనుంది. దాదాపు 16 ఎకరాల ప్రైవేట్ ఆలయానికి సంబంధించిన ల్యాండ్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు సంబంధించి 84 కండిషన్స్ పెట్టారు.

